‘ప్రయాగ్‌రాజ్‌’కు కేంద్రం ఆమోదం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్ నగరం పేరును ‘ప్రయాగ్‌రాజ్‌’గా మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రెండు నెలల క్రితమే యూపీ ప్రభుత్వం అలహాబాద్ పేరును చరిత్రాత్మక ప్రయాగ్‌రాజ్‌గా మార్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనను ఆమోదించాలని కోరుతూ 10 రోజుల క్రితం కేంద్ర హోంశాఖను యూపీ సర్కార్ కోరింది.

తాజాగా, ఈ ప్రతిపాదనకి కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రయాగ్‌రాజ్‌ (అలహాబాద్)లో కుంభమేళా ప్రారంభం కావడానికి 15 రోజుల ముందు కేంద్రం ఆమోదం లభించింది. ఈ నెల 15న మకర సంక్రాంతి రోజున ‘ప్రయాగ్‌రాజ్‌లో మొదలయ్యే కుంభమేళా మార్చి నాలుగో తేదీన మహా శివరాత్రితో ముగియనుంది. ఈ వేడుకకి హాజరుకావాలంటూ తెరాస వర్కింగ్ ప్రెసిడెంటు కేటీఆర్ కు ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే.