సమాజ్ వాది పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ సోమవారం పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ… పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తర్వాత యూపీఏ ప్రభుత్వం లోక్ సభ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని చెప్పారు. అయితే “నాకున్న సమాచారం ప్రకారం బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యాక ఎన్నికల ప్రకటన రావచ్చు. ముందస్తు లోక్ సభ ఎన్నికలకు కార్యకర్తలందరు సంసిద్ధులై ఉండాలి అని ములాయం పిలుపునిచ్చారు. సెప్టెంబర్ లో ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు.