రియో ఒలింపిక్స్లో భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసిన పీవీ సింధు కు ఘన స్వాగతం పలికింది తెలంగాణ ప్రభుత్వం. ఎయిర్ పోర్ట్ నుండి విజయోత్సవ ర్యాలీగా బయలుదేరారు. దారి పొడవునా బాణ సంచాకాలుస్తూ… ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. జయహో సింధు అంటూ నినదించారు. అభిమానులు, ప్రజలకు అభివాదం చేస్తూ సింధు, కోచ్ గోపీచంద్ గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమం లో పాల్గొన్నారు. ఇద్దరినీ శాలువాలు కప్పి, మెమొంటోలతో ఘనంగా సన్మానించారు.
ఈ వేడుకలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ, రాష్ట్ర డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఐటీ మంత్రి కేటీఆర్, మంత్రి మహేందర్ రెడ్డి తదితరలు పాల్గొన్నారు.