ప్రధాని అభ్యర్థి రాహులే : దిగ్విజయ్‌

Digvijaya Singh2014 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా జరుగుతున్న జైపూర్ కాంగ్రెస్ చింతన్ శిబిర్ రెండో రోజు ప్రారంభమైంది. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ప్రారంభోపన్యాసంతో తొలి రోజు ప్రారంభమైన సదస్సు ప్రధానంగా ఐదు అంశాలపై చేపట్టిన చర్చ ఇవాళ కూడా జరగనుంది. ఈ చర్చల్లో మన రాష్ట్రానికి చెందిన నేతలు కూడా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా విలేఖరులతో ముచ్చటిస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్… ప్రధాని అభ్యర్థి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ అని ఆయనపై ఒత్తిడి పెంచొద్దని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ తానేమి చేయదలచుకున్నారో యువనేత నే నిర్ణయించుకోనివ్వాలన్నారు. లోక్ సభ ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రకటించలేదని దిగ్విజయ్ సింగ్ గుర్తు చేశారు.