మళ్లీ.. కర్ణిసేన హెచ్చరికలు !

రాజ్ పుత్ కర్ణిసేన మరోసారి తీవ్ర హెచ్చరికలు చేసింది. భన్సాలీ ‘పద్మావత్’ సినిమా రిలీజ్ విషయంలో కర్ణిసేన చేసిన హంగామా తెలిసిందే. అన్ని అడ్డంకులు దాటుకొని ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘పద్మావత్’ సూపర్ హిట్ అయ్యింది. ఐతే, ఇప్పుడు మరోసారి కర్ణిసేన హెచ్చరికలు జారీ చేసింది. ఈ సారి రాజస్థాన్ మంత్రి కిరణ్ మహేశ్వరిని టార్గెట్ చేసింది. మంత్రి రాజ్ పుత్ లని ఎలుకలతో పోలుస్తూ కామెంట్ చేయడమే ఇందుకు కారణం.

మంత్రి కిరణ్‌ మహేశ్వరి ముక్కు, చెవులు కోసేస్తామని కర్ణిసేన ప్రకటించింది. రాజ్‌పుత్రులపై వ్యాఖ్యలు చేసినందుకుగాను తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మరోవైపు, తాను రాజ్‌పుత్రులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని మంత్రి అంటున్నారు. తాను కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను రాజ్‌పుత్రులకు అన్వయిస్తూ సమాజంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. మరీ.. ఈ వివాదం ఏ టర్న్ తీసుకొంటుంది అన్నది చూడాలి.