అధిష్ఠానం బహిర్గతం చేయదు

Rayapati sambasivaraoతెలంగాణ ర్రాష్ర్ట ఏర్పాటుపై సంకేతాలు వస్తున్నాయని ఆ ప్రాంత నేతలు చేస్తున్న ప్రచారాన్ని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు కొట్టిపారేశారు. గుంటూరు విద్యార్థి జేఏసీ చేపట్టిన మహాశాంతి యాగాన్ని కావూరి
ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అటువంటి సంకేతాలను కాంగ్రెస్ అధిష్ఠానం బహిర్గతం చేసే అవకాశం ఉండదని, సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా రాజీనామా చేసేందుకు సీమాంధ్ర ప్రజాప్రత్రినిధులం సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల సమావేశాన్ని అడ్డుకొని నేతలను తరిమికొట్టాలని ఎంపీ మధుయాష్కీ చేసిన వ్యాఖ్యలను రాయపాటి ఖండించారు. హైదరాబాద్ లో జరిగే సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని కావూరి
తెలిపారు.