రేవంత్ రెడ్డి.. మరో దీక్ష రెడీ

revanth
తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేత రేవంత్‌రెడ్డి మ‌రో దీక్ష‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. మరో సారి సీఎం కేసీఆర్ పై పోరుకు రెడీ అయ్యారు. మొన్నామధ్య మల్లన్న సాగర్ ప్రాజక్టు నిర్వాసితులకు మద్దతుగా పెద్ద ఎత్తున బహిరంగ సభ చేపట్టి.. అనంతరం ఏటిగడ్డ కిష్టాపూర్ లో నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తీరు ఎండగట్టారు రేవంత్.

ఇప్పుడాయన మరో దీక్షకు దిగితున్నారు. హైద‌రాబాద్‌లోని ఇందిరా పార్కు వ‌ద్ద ఈ నెల 19, 20 తేదీల్లో త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి ఆయ‌న రైతు దీక్షకు దిగ‌నున్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం అవలంబిస్తున్న భూసేక‌ర‌ణ విధానానికి నిర‌స‌న‌గా, భూసేక‌ర‌ణ‌తో పాటు మహారాష్ట్రతో ఇటీవ‌ల‌ తెలంగాణ ప్ర‌భుత్వం చేసుకున్న‌ నీటి ఒప్పందాల లోపాలను ఈ దీక్ష ద్వారా ప్రజలకు వెల్లడించనున్నారు రేవంత్.