వరంగల్‌ ఉప ఎన్నికల బరిలో ‘సర్వే’ ఖరారు..

Sarve-Satyanarayanaమాజీ కాంగ్రెస్ ఎంపి రాజయ్య ఇంట్లో జరిగిన విషాదంతో త్వరలో జరగనున్న వరంగల్‌ ఉప ఎన్నికల బరి నుండి తప్పుకుంటున్నాని రాజయ్య తెలపడంతో , ఆ స్థానంలో మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ పేరును కాంగ్రెస్‌ పార్టీ ఖరారుచేసింది..దీంతో నామినేషన్ దాఖలు చేయడానికి సర్వే హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ కు వెళ్లారు.

అంతకుముందు సర్వే తో పీసీసీ ఛీప్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, సీనియర్‌ నేత జానారెడ్డి లు చర్చలు జరిపారు. పార్టీ అధిష్టానం కూడా ఆయనతో మంతనాలు జరిపి ఈ పోటిలో నిలబడాలని కోరడం జరిగింది..