రాహుల్ కు సుప్రీం మొట్టికాయలు

rahul
కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. మహాత్మాగాంధీ హత్యకు ఆరెస్సెస్‌ కారణమని గతంలో వ్యాఖ్యానించారు రాహుల్. ఈ వ్యాఖ్యలపై పరువునష్టం దావా వేసింది ఆరెస్సెస్‌. కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తాజాగా వ్యాఖ్యానిస్తూ.. ‘‘మీరేం మాట్లాడుతున్నారో.. అది ప్రజలకు మంచిదా? లేదా? అనే విషయాన్ని ఆలోచించాలి. ఎలాంటి ఆధారాలు లేకుండా ఓ సంస్థపై అలాంటి నిందలు ఎలా వేస్తారని రాహుల్‌ను ప్రశ్నించిన సుప్రీం.. ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపనలు చెప్పాలని, లేదంటే విచారణ ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలని ఆదేశించింది. ఇందుకోసం ఈ నెల 27 వరకూ గడువిచ్చింది సుప్రీం.