సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో నాయకులకు, అధికారుల మధ్య కోల్డ్ వార్ మొదలైంది. ఎక్కడ ఏమి జరిగినా మరో అన్నాహజరేలా మాటల తూటాలతో యుద్ధం చేసే కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకరన్న …. సీబీఐకి మరో లేఖ రాసి బోర్డు ఇంజినీర్లు, అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. శంకర్రావు లేఖతో అధికారులు అప్రమత్తమై అక్రమకట్టడాలపై కొరడా ఘులిపిస్తున్నారు. స్పెషల్ డ్రైవ్ పేరిట అక్రమ కట్టడాలను తొలగించే పనిలో పడ్డారు అధికారులు. కంటోన్మెంట్ లో ఉండే ఇంజనీర్లు, సభ్యులు బిల్డర్ల వద్ద నుంచి లంచాలు వసూలు చేస్తున్నారని శంకర్రావు తన లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖపై స్థానిక అధికారి సుజాత గుప్త స్పందించారు…అక్రమ కట్టడాలను తొలిగిస్తామని ఆమె హామీ ఇచ్చారు.