విచారణకు సహకరించని శంకర్రావు

SHANKER-RAOమాజీ మంత్రి శంకర్రావు విచారణకు సహకరించలేదని సీఐడీ అదనపు డీజీ కృష్ణప్రసాద్ తెలిపారు. శంకర్రావు వ్యవహారంలో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో… ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. దీంతో సీఐడీ అడిషనల్ డీజీ కృష్ణప్రసాద్ నేతృత్వంలో విచారణ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. శంకరరావు విచారణ కోసం రెండు సార్లు కేర్ ఆసుపత్రికి వెళ్లినట్లు కృష్ణప్రసాద్ చెప్పారు. అయితే విచారణకు శంకర్రావు మరియు ఆయన కుటుంబ సభ్యులు కూడా సహకరించడంలేదని ఆయన తెలిపారు. శంకర్రావు విచారణ పూర్తయిన తరవాత నేరెడ్ మెట్ పోలీసులను ప్రశ్నిస్తామని డీజీ వెల్లడించారు.