మంత్రులు ఈమెను సెక్సువల్ గా వాడుకున్నారట

sarith
సంచలన ఆరోపణలతో కేరళ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించిన సరితా నాయర్ మరోసారి వార్తల్లోకి వచ్చారు. సోలార్ ప్యానల్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సరితా నాయర్ ఓ చీటింగ్ కేసుకు సంబంధించి కోయంబత్తూరు కోర్టుకు హాజరైన సందర్భంగా మాట్లాడుతూ.. కేరళ మాజీ ఆర్థిక మంత్రి పళని మాణిక్యం ఓ ఐటీ కేసునకు సంబంధించి కోటి లంచం డిమాండ్ చేయగా అడ్వాన్స్‌గా తాను 25 లక్షలు ఇచ్చానని, లంచం తీసుకున్న తర్వాత ఆ మంత్రి తనను లైంగికంగా వేధించారని ఆరోపించారు. అలాగే కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీతో పాటు నలుగురు నేతలు తనను లైంగికంగా వేధించి, తనతో ఆర్థిక నేరాలు కూడా చేయించినట్లు ఆరోపించారు సరితా.