రాష్ట్ర అభివృద్ధికి కృషి : సుజనా

sujana chowdary
రాష్ట్ర అభివృద్ధిలో ఎంపీల భాగస్వామ్యం ఉండేలా.. భవిష్యత్‌లో పార్లమెంటు సభ్యులమంతా పని చేస్తామని ఎంపీ సుజనా చౌదరి చెప్పా . రైతు రుణమాఫీపై ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం ఎంపీ సుజనా మీడియాతో మాట్లాడారు.కేంద్రంలోని అన్ని మంత్రిత్వశాఖల సబ్‌కమిటీల్లో టీడీపీ ఎంపీలకు ప్రాధాన్యత లభించిందని ఆయన అన్నారు. తెలుగువారి సమస్యలపై ఎంపీల ఫోరం కృషి చేస్తోందని ఆయన చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరును తెలుసుకునేందుకు టీడీపీ ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేయనుందని సుజనా చౌదరి వెల్లడించారు. ఏపీ రాజధాని సాంకేతిక పరంగాను, ప్రజలకు అనుకూలంగా ఉండేలా సీఎం రూపొందిస్తారని ఆయన చెప్పారు. రాజధాని ఏర్పాటుపై వెబ్‌ల ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతామని ఎంపీ చెప్పారు.