బిజెపి నేత, కేంద్రమంత్రి సురేశ్ప్రభుకు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మిత్రపక్ష పొత్తు నేపథ్యంలో గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్కు అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ సారి ఏపీ నుంచి బిజెపి తరపున సురేశ్ ప్రభును పేరును బిజెపి అధిష్ఠానం సూచించగా, దీనికి టీడీపీ అధినేత చంద్రబాబు సూచన ప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. అలాగే, ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న నిర్మలా సీతారామన్ కు ఈసారి కర్ణాటక నుంచి అవకాశం కల్పించారు. అలాగే కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికైన మంత్రి వెంకయ్య నాయుడు ఈసారి రాజస్థాన్ నుంచి బరిలో దిగనున్నారు.