తెలంగాణలో మహాకూటమి సీట్ల సర్థుబాటు ఇంకా కొలిక్కిరాలేదు. ఐతే, టీడీపీ 14సీట్ల కేటాయిస్తున్న క్రాంగ్రెస్ ప్రకటించేసింది. మరో నాలుగు స్థానాలు కావాలని టీడీపీ పట్టుబట్టాలని భావించింది. ఐతే, సీట్ల కోసం కాదు మహాకూటమి గెలుపుకోసం మాత్రమే చూడండని ఆ పార్టీ అధినేత చంద్రబాబు సూచించడంతో టీడీపీ నేతలు 14స్థానాలతో సంతృప్తి చెందారు. ఈ 14 స్థానాల్లో ఇప్పటికే 11స్థానాలు ఏంటన్నది బయటికొచ్చింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
1. ఖమ్మం
2. సత్తుపల్లి
3. అశ్వారావుపేట
4. మక్తల్
5. దేవరకద్ర
6. ఉప్పల్
7. శేరిలింగంపల్లి
8. కూకట్పల్లి
9. పటాన్చెరు
10. నిజామాబాద్ రూరల్
11. కరీంనగర్ స్థానాలు టీడీపీకి దక్కినట్లు తెలుస్తోంది