తెలుగుదేశం పార్టీ తరపున ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేసే రాజ్యసభ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. కేంద్రమంత్రిగా ఉన్న సుజనా చౌదరికి మరోసారి అవకాశం కల్పిస్తూ.. కొత్తగా టీజీ వెంకటేష్ పేరును ఖరారు చేశారు. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. మూడో అభ్యర్థిగా మిత్రపక్షం బీజేపీకి కేటాయించారు. ముందుగా చెప్పినట్లే కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ప్రభు పేరును ఖరారు చేశారు.