పుల్లెల గోపీచంద్ కు షాక్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం.

pullela-gopichandరియో ఒలింపిక్స్ లో భారత సత్తా చాటిన స్టార్ షట్లర్ పీవీ సింధు విజయం వెనుక ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్ కృషి , శ్రమ ఎంతో ఉందని అందరికి తెలుసు. రజత పతకంతో సింధు తో పాటు ఆమె కోచ్ గోపీచంద్ ఈ ఉదయం హైదరాబాద్ కు చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ నుండి విజయోత్సవ ర్యాలీతో వీరికి ఘన స్వాగతం పలికింది తెలంగాణా ప్రభుత్వం. ఈ సందర్బంగా గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమం లో పలువురు మంత్రులు మాట్లాడుతూ సింధు ను పొగడ్తలతో నింపేసారు.

ఇక గోపీచంద్ కు మాత్రం తెలంగాణ సర్కారు నుంచి భారీ షాక్ తగిలింది. తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ… జాతీయ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. కోచ్ గా గోపీచంద్ మెరుగ్గా రాణిస్తున్నారని కితాబిచ్చిన అలీ… పీవీ సింధుకు మాత్రం మరింత మెరుగైన కోచ్ కోసం వెతుకుతున్నామని ప్రకటించారు. దీంతో గోపీచంద్ షాక్ తిన్నాడు. మరి గోపి కంటే మెరుగయినా వాడు ఎవరు చూడాలి మరి.