తెలంగాణపై చర్చలు జరుగుతున్నాయి

vayalar-raviనిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ కేంద్రమంత్రి వాయలార్ రవితో భేటీ అయ్యారు. అనంతరం వాయలార్ రవి మాట్లాడుతూ.. తెలంగాణ సెంటిమెంట్ ను యాష్కీ తనకు వివరించారని తెలిపారు. మిగితా ఎంపీలందరితో చర్చిస్తామని రవి తెలిపారు. చాలాకాలంగా తెలంగాణ కావాలన్న డిమాండ్ ఉందని.. నిర్ణయం ప్రకటించాలని ఆ ప్రాంతనేతలు కోరుతున్నారని అన్నారు. అయితే కేంద్రం ఆ దిశలో చర్చలు జరుపుతుందని, అయితే త్వరలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇతర సీనియర్ నేతలతో తెలంగాణ విషయమై మాట్లాడతామని చెప్పారు. సంప్రదింపుల తేదిలను కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ను అడగాలని తెలంగాణ ఎంపీలకు సూచించారు.