లోక్‌సభ సీట్ల ఫై ఎర్రబెల్లి లెక్కలు ఇలా ఉన్నాయి..

తెలంగాణ రాష్ట్రంలో కార్ జోరు మరోసారి చూపించబోతున్నామని తెరాస నేతలు చెపుతున్నారు. శాసన , గ్రామపంచాయితీ ఎన్నికల్లో ఎలాగైతే భారీ సీట్లు సాధించామో..లోక్‌సభ ఎన్నికల్లోను అదే రిపీట్ చేయబోతున్నామని ముందు నుండి చెప్పుకుంటూ వస్తున్నారు. తాజాగా తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సైతం తన లెక్కలను బయటకు చెప్పుకొచ్చారు.

మే 23న విడుదలయ్యే లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ 16 సీట్లు గెలవడం ఖాయమని స్పష్టంచేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ జెండా ఎగిరేలా అందరూ కృషిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇక ఎర్రబెల్లి రాజకీయ గ్రాఫ్ చూస్తే ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఈయన.. వర్ధన్నపేట నుంచి మూడుసార్లు, పాలకుర్తి నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరి 2019 లో తొలిసారి మంత్రి అయ్యారు.