తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కన్నా కలలు నెరవేరటం తో మొక్కులు తీర్చే పనిలో పడ్డాడు..తెలంగాణ ఇంద్రకీలాద్రిగా ప్రసిద్దిగాంచిన వరంగల్ భద్రకాళి అమ్మవారికి స్వర్ణకిరీటం సమర్పిస్తానని కేసీఆర్ మొక్కుకోవడం జరిగింది..దానికి గాను దుర్గాష్టమి పర్వదినం, అమ్మవారి జన్మనక్షత్రం సందర్భంగా ఈరోజు ఆ మొక్కు తీర్చుకున్నాడు..
రూ.3.7 కోట్ల వ్యయంతో తయారు చేయించిన 11.7 కిలోల స్వర్ణకిరీటం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో మధుసూదనాచారి, రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, కడియం శ్రీహరి, ఎంపీ వినోద్, ఎమ్మెల్యే వినయ్భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.