మంత్రులంతా మెదక్ బాట పట్టారు. ఉపఎన్నికల్లో భారీ మెజార్టీ లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ మంత్రులు. ఒక్కో మంత్రి ఒక్కో నియోజక వర్గానికి ఇంఛార్జీగా వ్యవహరిస్తూ..సమీక్షలు జరుపుతున్నారు. మెదక్ లోక్సభ ఉపఎన్నిక నేపథ్యంలో మంత్రులంతా మెదక్ వెళ్లడంతో సచివాలయం వెలవెలబోతోంది. సందర్శకులు పెద్దగా రావడం లేదు.