చిదంబరంకు కాంగ్రెస్ షాక్ !

41396967834_625x300 కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరంకు కాంగ్రెస్ షాక్ ఇచ్చింది. తమిళనాడు కాంగ్రెస్ శాఖ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఇటీవల పార్టీకి, సీనియర్ నాయకుడు కామరాజ్ కు వ్యతిరేకంగా కార్తీ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై వారంలోగా వివరణ ఇవ్వాలని కార్తీని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది.

ఈ విషయాన్ని టీఎన్ సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇలన్ గోవన్ ధృవీకరించారు. పార్టీ హైకమాండ్ పై చేసిన వ్యాఖ్యలపై కూడా కార్తీని వివరణ అడిగామని ఆయన అన్నారు. ఇప్పుడు కార్తీ ఇచ్చే వివరణపైనే.. కాంగ్రెస్ లో కార్తీ భవితవ్యం ఆధారపడి వుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో.. యువ నాయకుడు కార్తీ చిదంబరం వివరణ ఎలా వుంటుందో అనే ఆసక్తి నెలకొంది. చిదంబరం వారసుడి రాజకీయాల్లీకి వచ్చిన కార్తీ.. కాంగ్రెస్ ను వీడే ప్రసక్తే లేదని మరో వర్గం వాదిస్తోంది. ఏదేమైనా.. ఈ విషయం చిదంబరాన్ని కాస్త కలవరపెట్టేదే.