కేసీఆర్ వెంట కదిలిన టాలీవుడ్

chiru and nag
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం పథకంలో టాలీవుడ్ సెలబ్రటీలు పాలు పంచుకున్నారు. ముఖ్యమంత్రి కెసీఆర్ పిలుపుకు కదిలిన పలువురు టాలీవుడ్ సెలబ్రటీలు హరితహారంలో బాగమయ్యారు. చిరంజీవి, నాగార్జున, అమల, అల్లు అర్జున్‌, రానా దగ్గుబాటి, మంచులక్ష్మి, రెజీనా తదితరులు హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.

నాగార్జున అన్నపూర్ణ స్టూడియోలో మొక్కలు నాటారు. దీన్ని ఇలాగే కొనసాగిస్తామని ప్రమాణం చేస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. ఆయన సతీమణి అమల కూకట్‌పల్లిలో తన అభిమానులతో కలిసి హరితహారంలో పాల్గొన్నట్లు తెలిపారు. రానా దగ్గుబాటి నానక్‌రామ్‌గూడలో మొక్కలు నాటినట్లు తెలుపుతూ.. ట్విట్టర్‌లో ఫొటోలను పోస్ట్‌ చేశారు. మంచులక్ష్మి తన సహనటులతో కలిసి మొక్కలు నాటినట్లు ట్వీట్‌ చేశారు. రకుల్ ప్రీత్, రాశిఖన్నా కూడా హరితహారంలో పాలు పంచుకున్నారు. మానవ మనుగడకు మొక్కలు ప్రాణాధారమని తెలుపుతూ.. అభిమానులు సైతం మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు వీరంతా.