తమాషా : కోమట్ రెడ్డికి టీఆర్ఎస్ కండువా కప్పబోయిన ఓటరు

నల్గొండలో కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో తమాషా జరిగింది. నల్గొండలో కోమట్ రెడ్డి బ్రదర్స్ కి మంచి పట్టుంది. ఈసారి కూడా నల్గొండ స్థానం నుంచి కోమట్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇప్పటికే ప్రచారం కూడా మొదలెట్టారు. ఈ క్రమంలో ఈ రోజు నల్గొండలోని పాతబస్తీలో కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రచారం చేశారు. ఈ సమయంలో ఓ దుకాణం వద్ద ఓట్లు అభ్యర్థిస్తున్న సమయంలో అక్కడున్న ఓ వ్యక్తి కోమటిరెడ్డికి తెరాస కండువా కప్పబోయాడు.

ఈ ఘటనతో షాక్ కి గురైన కోమటిరెడ్డి ఒక్కసారిగా వెనక్కి తగ్గారు. ఆ వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ ఓటరు కావాలనే ఈ పని చేశారా.. ? లేదంటే దీని వెనక ఏదైనా పొలిటికల్ ప్లాన్ ఉందా ?? అనేది తెలియాల్సి ఉంది. కాంగ్రెస్ నేతలు మాత్రం ఆ వ్యక్తి టీఆర్ ఎస్ కి చెందిన వ్యక్తిని చెప్పుకొంటున్నారు. ఇక, గతంలో నల్గొండ, భువనగిరి ఎంపీ నియోజకవర్గ స్థానాల్లో కోమట్ రెడ్డి బ్రదర్స్ హవా కొనసాగేది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత వీరి ప్రభావం నల్గొండ పార్లమెంట్ నియోజవర్గ స్థానాలకి మాత్రమే పరిమితం కానుందని చెబుతున్నారు.