ముద్రగడ గెలిచాడు – తుని ఘటన ముద్దాయిల విడుదల

Mudragada-health-critical

కాపు ఉద్యమనే ముద్రగడ లక్ష్యం కొంత మేరకు నెరవేరినట్టయింది. కాపు రిజర్వేషన్లు, తుని ఘటన అరెస్టులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ముద్రగడ దీక్ష 9వ రోజుకి చేరుకొంది. ఆయన ఆరోగ్యం కూడా క్షీణించినట్టు డాక్టర్లు చెబుతున్నారు. అయితే, తాజాగా తుని సంఘటనలో నలుగురు ముద్దాయిలకు బెయిల్ మంజూరు చేసింది పిఠాపురం జిల్లా కోర్టు. కూరాకుల పుల్లయ్య, పల్లా శ్రీహరి, చెక్కపల్లి సత్యనారాయణ, లవుడు శ్రీనివాస్ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. దీంతో.. దీక్ష చేస్తోన్న ముద్రగడ లక్ష్యం కొంత మేరకు నెరవేరినట్టయింది. మరోవైపు, ముద్రగడ ఆరోగ్యం క్షీణిస్తోన్న నేపథ్యంలో కాపు ముఖ్యనేతలు మరోసారి అత్యవసరంగా భేటీ కానున్నారు.