ఆధార్ అప్ డేషన్ 3 నెలలపాటు ఉచితం


యూఐడీఏఐ ఆధార్ అప్ డేషన్ 3 నెలలపాటు ఉచితంగా అందించనుంది. ఆన్‌లైన్‌లో ఆధార్ అప్‌డేట్‌ సౌకర్యాన్ని ఈ ఏడాది మార్చి 15 నుంచి జూన్ 14 వరకూ ఉచితంగా అందిస్తామని భారత విశిష్ఠ ప్రాధికార గుర్తింపు సంస్థ వెల్లడించింది. కాగా ఇది ఆధార్ పోర్టల్‌కు మాత్రమే పరిమితమని, బయట ఆధార్ కేంద్రాల్లో అయితే రూ.50 చెల్లించాలని యూఐడీఏఐ స్పష్టం చేసింది. గతంలో అప్‌డేట్‌ కోసం 25 రూపాయలు చెల్లించాల్సి ఉండగా.. ప్రజల సౌకర్యార్థం ఉచితంగా అందిస్తామని తెలిపింది. ఆధార్ కార్డు తీసుకొని పదేళ్లు దాటితే ఆధార్ అప్ డేషన్ చేయించుకోవాలని యూఐడీఏఐ తెలిపింది.