వరవరరావు అరెస్ట్

Varavaraoవిరసం నేత వరవరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక పేరుతో విరసం నేతలు ఇవాళ సభ నిర్వహించాలనుకున్నారు. ఈ సదస్సుకు పోలీసులు అనుమతించలేదు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి తుల్జాభవన్‌లో ఉన్న 50 మంది విరసం కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరవరరావుతో పాటు పినాకపాణి, పద్మకుమారి, వరలక్ష్మి, జార్ఖండ్ కళాకారుడు జీతన్ మరాండి తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు.అనంతరం వారందరిని కంచన్బాగ్ పోలీసు స్టేషన్కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో ఇతర రాష్ట్రాలకు చెందిన కళాకారులు ఉన్నారు.