దుబ్బాక నుండి రాములమ్మ పోటీ..

సినీ నటి , కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం. మొన్నటి వరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని తెగేసి చెప్పిన విజయశాంతి ఇప్పుడు మనసు మార్చుకున్నట్లు తెలుస్తుంది. అధిష్టానం పెద్దలు, పార్టీ సీనియర్ నేతల సూచన మేరకు ఆమె బరిలోకి దిగినట్లు సమాచారం.

2014లో మెదక్‌ అసెంబ్లీ స్థానానికి పోటీచేసిన ఈమె, పద్మాదేవేందర్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. సినీగ్లామర్‌కు తోడు ఎంపీగా గ్రామాల్లో చేసిన అభివృద్ధిపనుల వల్ల తన గెలుపు ఖాయమని భావించిన విజయశాంతికి గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాభావం తప్పలేదు. ఈసారి మాత్రం మెదక్ నియోజకవర్గం నుంచి కాకుండా దుబ్బాక నుంచి పోటీచేయాలని నిర్ణయించుకుంది. మరి ఈసారి ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి. ప్రస్తుతం రాములమ్మ కాంగ్రెస్ క్యాంపెయినర్‌గా ప్రచారం చేస్తుంది.