దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్నేత షీలా దీక్షిత్కు దిల్లీ అవినితీ నిరోధక శాఖ నోటీసులు జారీ చేసింది. రూ.400 కోట్ల నీటి ట్యాంకర్ల కుంభకోణానికి సంబంధించి వివరణ ఇవ్వాల్సిందింగా షీలాదీక్షిత్కు పంపిన నోటీసులో పేర్కొంది. ఈనెల 26న జరగనున్న విచారణకు హాజరు కావాల్సిందింగా ఆమెను ఆదేశించింది. ఆమెతో పాటు పలువురు జల మండలి అధికారులకు, ఈ విషయమై దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని విచారించనున్నట్లు తెలిపింది ఏసీబీ. కాంగ్రెస్ పార్టీ నుంచి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా షీలా దీక్షిత్ పేరు ఖరారైన నేపథ్యంలో ఈ నోటీసులు రావడం చర్చనీయంశమైయింది.