వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికలో కారు దుమ్ములేపింది. ప్రత్యర్థి పార్టీలు దరిదాపులో కూడా లేనంత మెజారిటీతో ఫుల్ స్పీడ్ తో దూసుకపోయింది. టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణపై ఆయన 4,59,092 ఓట్ల మెజారిటీతో గెలిచి, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా లేకుండా చేసాడు..
ఈ ఉప ఎన్నికలో దయాకర్కు 6,15,403 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణకు 1,56,311 ఓట్లు, బీజేపీ అభ్యర్థి పగిడిపల్లి దేవయ్యకు 1,30,178 ఓట్లు వచ్చాయి. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్కు 23,336 ఓట్లు వచ్చాయి.