మెగా బ్ల‌డ్ బ్ర‌ద‌ర్స్‌ కి గణ‌తంత్ర దినోత్స‌వ శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి

దేశ వ్యాప్తంగా 72 వ గణ‌తంత్ర దినోత్స‌వ వేడుకలు ఘ‌నంగా దేశ ప్రజలు జరుపుకుంటున్నారు. సామాన్య ప్రజలు , సెల‌బ్రిటీలు త‌మ సోష‌ల్ మీడియా ద్వారా శుభాకాంక్ష‌లు తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సైతం దేశ ప్ర‌జ‌లంద‌ర‌కి, మెగా అభిమానుల‌కు, ఆత్మీయులంద‌రికి 72వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ శుబాకాంక్ష‌లు తెలిపారు. రిప‌బ్లిక్ డే సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకొని విస్తృతంగా రక్త‌దానం చేయాల్సిందిగా మెగా బ్ల‌డ్ బ్ర‌ద‌ర్స్‌ని మ‌న‌స్పూర్తిగా ఆహ్వానిస్తున్నాను. నా పిలుపు మేర‌కు స్పందించి, చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్‌కు వ‌చ్చి, ర‌క్త‌దానం చేసిన‌, చేస్తున్న రక్త‌దాక్త‌ల‌కు హృద‌య పూర్వక ధ‌న్య‌వాదాలు. ర‌క్త దానం చేయండి, ప్రాణ దాత‌లు కండి అంటూ చిరంజీవి త‌న వాయిస్ వీడియో ద్వారా సందేశాన్ని అందించారు.

pic.twitter.com/PkqJgxulau— Chiranjeevi Konidela (@KChiruTweets) January 25, 2021