ఇక స్టేట్ పాలిటిక్స్ పై దృష్టి ….జయప్రద

తాను ఇకనుంచీ రాష్ట్ర రాజకీయాలపైన దృష్టి సారిస్తానని ప్రముఖ సినీ నటి, మాజీ పార్లమెంట్ సభ్యురాలు జయప్రద అన్నారు. గురువారం నాడు నగరంలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆభరణాల షో రూమ్ లో సరికొత్త కలెక్షన్ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు వజ్రాభరణాలంటే చాలా ఇష్టమని అన్నారు. కాగా ప్రముఖ డిజైనర్ రీనా టాకూర్ డిజైన్ చేసిన నెక్లెసులను పండుగల సీజన్ దృష్ట్యా ప్రదర్సిస్తున్నట్టు షో రూమ్ నిర్వాహకులు తెలిపారు.