జాన్వీ హగ్ పిక్స్ వైరల్

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ సినిమాలతోనే కాదు సోషల్ మీడియా లోను నిత్యం యాక్టివ్ గా ఉంటుందనే సంగతి తెలిసిందే. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో పాటు పలు పార్టీలకు సంబదించిన పిక్స్ ను సైతం షేర్ చేస్తుంటుంది. తాజాగా ఒక పార్టీలో అక్ష‌త్ రాజ‌న్ అనే కుర్రాడితో జాన్వీ క‌పూర్ క్లోజ్ గా ఉన్న పిక్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. వీరిద్ద‌రూ హ‌గ్ చేసుకుని ఫొటోల‌కు పోజులు ఇచ్చారు. అత‌డు చొర‌వ తీసుకుని జాన్వీ క‌పూర్ బుగ్గ‌ల‌పై ముద్దులు పెడుతూ, కౌగిలించుకుంటూ పోజులిచ్చాడు. ఆ ఫొటోల‌ను జాన్వీ షేర్ చేసింది.

అలాగే ఆ పార్టీలో జాన్వీ చెల్లెలు ఖుషీ క‌పూర్ కూడా క‌నిపించింది. త‌మ స్నేహితులంద‌రితో క‌లిసి వీరు పోజులిచ్చారు. ఈ నేప‌థ్యంలో జాన్వీ ప్రేమ‌లో ప‌డింద‌ని, అక్ష‌త్ రాజ‌న్ అనే అత‌డికీ, జాన్వీకి మ‌ధ్య‌న ల‌వ్ స్టోరీ న‌డుస్తోంద‌నే టాక్ బి టౌన్ లో వినిపిస్తుంది.