కపిల్ దేవ్ కి పిచ్చ కోపం వచ్చింది

kapil

టీమిండియా వెటరన్ క్రికెటర్ కపిల్‌దేవ్‌ కి మీడియాపై పిచ్చకోపం వచ్చింది. ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న ఆగ్రహనికి కారణమైయింది.

వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ వేదికగా అక్టోబర్‌ 7 నుంచి ప్రపంచకప్‌ కబడ్డీ టోర్నీ జరగనున్న సంగతి తెలిసిందే. ఇందులో బాగంగా టీమిండియా జెర్సీ ఆవిష్కరణ సమావేశానికి కపిల్‌దేవ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో.. ఈ టోర్నీకి పాక్‌ జట్టును ఎందుకు ఆహ్వానించలేదని ఓ విలేకరి కపిల్ ని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు తీవ్ర అసహనానికి గురైన కపిల్‌.. ఇలాంటి సమయంలో అడగాల్సిన ప్రశ్నేనా అని మండిపడ్డాడు. జమ్మూ కాశ్మీర్ వుగ్రదాడిని ప్రస్తావిస్తూ..‘నువ్వు భారతీయుడివైతే ఇలాంటి పరిస్థితులో ఈ ప్రశ్న అడగవు. ఈ ప్రశ్న అడగడానికి ఇదా సమయం? అని ఎదురుప్రశ్న వేశాడు కపిల్. దీంతో ఆ విలేఖరి నోట మాటరాలేదు.