మాధవీలత సంచలన నిర్ణయం

ఆ మధ్య అతి తీవ్రతతో చనిపోతానంటూ నానా హడావిడి చేసిన బీజేపీ యువ నేత, హీరోయిన్ మాధవీలత..ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకుంది. దాదాపు 5.6 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్న తన పర్సనల్ ఫేస్ బుక్ ఖాతా నుంచి తప్పుకున్నట్లు తెలుపుతూ పోస్ట్ పెట్టింది.

ప్రియమైన ఫాలోవర్స్‌.. నా ఫేస్ బుక్‌లో నెగిటివిటీకి పూర్తిగా విసుగుచెందాను. దాదాపు 90 శాతం మంది నాపై నెగిటివ్‌గానే స్పందిస్తున్నారు. ఈ సమాజానికి ఫేక్ అండ్ ప్లాస్టిక్ నవ్వులే కావాలి. నేను అలా ఉండలేను. ఈరోజు నుంచి నా ఫేస్ బుక్‌ని నేను హ్యాండిల్ చేయడం లేదు. ఇకపై నా టీం హ్యాండిల్ చేస్తుంది. ఏదైనా ముఖ్యమైన సమాచారం ఉంటే ఇంట్రాక్ట్ అవుతాను. నన్ను అభిమానించే వాళ్లు ప్రేమకు సపోర్ట్‌కి చాలా థాంక్స్. ఇకపై ట్విట్టర్, ఇన్ స్ట్రాగ్రామ్‌లో అందుబాటులో ఉంటా’ అంటూ పోస్ట్ పెట్టింది మాధవీలత.