సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్రకర్మపై మావోయిస్టులు దాడిచేసి కాల్పులు జరిపారు. ఛత్తీస్ ఘడ్ దంతెవాడ జిల్లాలోని ఆర్కే పాల్ వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. కాంవాయ్ తో దంతెవాడకు వస్తున్న మహేంద్రకర్మపై హఠాత్తుగా మావోలు కాల్పులు జరిపారు. మహేంద్రకర్మ తృటిలో కాల్పుల నుండి తప్పించుకున్నారు… అయితే కర్మ అనుచరుల్లో ముగ్గురు ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడినట్టు సమాచారం.