రష్మిక బాలీవుడ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

తెలుగులో వరుస పెట్టి సినిమాలు చేస్తున్న రష్మిక..బాలీవుడ్ లోను మిస్టర్ మజ్ను అనే మూవీ చేస్తుంది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటించగా… స్పై థ్రిల్లర్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాని శంతను బాగ్చి రూపొందిస్తున్నారు. బాలీవుడ్ అగ్ర నిర్మాత రోనీ స్క్రూవాలా అమర్ బుటాలా, గరిమా మెహతాతో కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నారు.

కాగా ఈ చిత్రాన్ని 2022, మే 13న సమ్మర్ కానుకగా విడుదల చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన చేసారు. ఇటీవలే షూటింగ్ పూర్తైన ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్స్ వర్క్‌ను జరుపుకుంటోంది. మరి రష్మిక డెబ్యూ హిందీ మూవీతో ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి. ఇక ఆమె నటిస్తున్న తెలుగు పాన్ ఇండియన్ సినిమా ‘పుష్ప’ డిసెంబర్ 17న 5 భాషలలో విడుదల కానుంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నాడు. రెండు భాగాలుగా ఇది రానుంది. అలాగే యంగ్ హీరో శర్వానంద్ సరసన ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ అనే సినిమా చేస్తోంది.