” బాబు క్షమాపణ చెప్పాలి “

ponguleti sudhakarreddyకాంగ్రెస్ పార్టీ , నాయకులపైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఎ ఐ సి సి కార్యదర్శి పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేసారు. రాష్ట్రంలోని సంపదను కాంగ్రెస్ నాయకులు అడవిపందుల్లా తిన్నారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమైనవని ఆయన అన్నారు. చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కూడా పొంగులేటి డిమాండ్ చేసారు. వోట్లు, సీట్లు అన్న కే సి ఆర్ స్టేట్ మెంటు తో ఆయన పట్ల ప్రజల భ్రమలు తొలగిపోయాయని పొంగులేటి అన్నారు. తెలంగాణా సెంటిమెంటు తో రాజకీయ లబ్ది పొందాలనుకోవటం సబబు కాదన్నారు.