ఓటిటి లో సాయిధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’?

దేవకట్ట దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేష్ జంటగా తెరకెక్కిన చిత్రం రిపబ్లిక్. ఈ చిత్రం జూన్ 4 న విడుదల కావాల్సి ఉంది, అయితే లాక్ డౌన్ కారణంగా థియేటర్ లు తెరుచుకునే అవకాశం లేకపోవడంతో ఓటిటి లో రిలీజ్ చేసేందుకు చర్చలు నడుస్తున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రం యొక్క డిజిటల్ రైట్స్ జీ సంస్థ దక్కించుకుంది, ఇందులోనే పే-పర్-వ్యూ మోడల్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట.ఇదివరకే ఈ చిత్రం టీజర్ రిలీజ్ చేయగా విశేష ఆదరణ లభించింది .