సాహసం 21న చూపిస్తారు

sahasamగోపీచంద్‌, తాప్సీ జంటగా చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సాహసం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదల తేది ఖరారైంది. ఈనెల 21 ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు నిర్మాత ‘ఛత్రపతి’ ప్రసాద్ ప్రకటించారు. గోపీచంద్ కు తప్పకుండా ఈ చిత్రం సూపర్ హిట్ ఇస్తుందన్నారు. తమ బ్యానర్ కూ మరో విజయం అందుతుందని ధీమా వ్యక్తం చేశారు. ‘శ్రీ’ అందించింన సంగీతం సినిమాకు మరో ప్లస్ పాయింటు అవుతుందని చెప్పారు. నిధి నిక్షేపాల అన్వేషణే ప్రధాన నేపథ్యంగా ఈ చిత్రం వుండబోతుంది. ఈ చిత్రంలో సన్నివేశాలను ఎక్కువ భాగం లడక్‌, రాజస్థాన్‌, జోర్డాన్‌లలో అడవులలో తెరకెక్కించారు.