జగన్ రిమాండ్ పొడిగింపు

వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కి ఈ నెల 22 వ తేది వరకు రిమాండ్ ను పొడిగిస్తూ కోర్టు ఆదేశించింది. అలాగే ఓబులాపురం మైనింగ్ కేసులో నిందితుడైన కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కి కూడా కోర్టు ఈ నెల 22 వరకు రిమాండ్ పొడిగించింది. జగన్ ఆస్తుల కేసులో, ఇతర కేసుల్లో నిందితులైన మోపిదేవి వెంకటరమణ , నిమ్మగడ్డ ప్రసాద్, సునీల్ రెడ్డి, బి.వి. శ్రీనివాస రెడ్డి, రాజగోపాల్, బ్రహ్మానంద రెడ్డి, ఆలీఖాన్ ల రిమాండ్ ను కూడా కోర్టు ఈ నెల 22 వరకు పొడిగించింది. నాంపల్లి సి.బి.ఐ.కోర్టు… వారిని గురువారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాదరావు, జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డి, ఐ ఎ ఎస్ అధికారులు బి.పి. ఆచార్య, శామ్యూల్ కూడా గురువారం కోర్టుకు హాజరయ్యారు.