లగ్జరీ కార్ల దిగ్గజం ఆడి కంపెనీ నుండి కొత్తగా ఎ6 35 టిఎఫ్ఎస్ఐ కారు ను మార్కెట్లో విడుదల చేసారు. ఢిల్లీ, ముం బైలలో ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ.45.90 లక్షలు. 1.8 లీటర్ల సామర్థ్యం గల 200 సిసి టర్బో చార్జ్డ్ టిఎఫ్ఎస్ఐ ఇంజన్ అత్యద్భుతమైన 190 హెచ్పి శక్తిని కారుకు అందిస్తుందని ఆడి ఇండియా హెడ్ జో కింగ్ తెలిపారు. ఇంధన సామర్థ్యం లీటరుకు 15.26 కిలోమీటర్లుంటుందని చెప్పారు.