మార్కెట్లోకి బజాజ్ నుండి వచ్చిన పల్సర్, అవేంజర్ బైక్స్ ఎలాంటి సంచలనం రేపాయో చెప్పనవసరం లేదు..యూత్ కు బాగా నచ్చసాయి ఈ బైక్స్..చాలామంది యూవత ఈ బైక్స్ ఫై మోజు పెంచుకున్నారు. ఇప్పటికే ఈ బైక్స్ బాగా సెల్ అవుతున్నాయి. తాజాగా బజాజ్ త్వరలో 500సీసీ స్పోర్ట్స్ బైక్ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది.
ఈ మధ్యనే న్యూడోమినర్ -400 పేరుతో ఓ బైక్ను విడుదల చేసిన బజాజ్ , తాజాగా 500 సీసీ బైక్ను విడుదల చేయాలని నిర్ణయించుకుంది. ఇది కూడా డోమినర్ రేంజ్ ధర రూ.1 లక్ష – 2 లక్షల్లోనే అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపింది. ఈ మధ్య నోట్ల రద్దు తో కాస్త బైక్స్ డిమాండ్ తగ్గిందని ఫిబ్రవరి నుండి మళ్లీ పుంజుకుందని సంస్థ చెప్పుకొచ్చింది.