హోలీ పండగా సందర్భాంగా ప్రవైట్ టెలికం సంస్థలతో పాటు ప్రభుత్వ రంగం టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ కూడా తమ వినియోగదారులకు పలు ఆఫర్స్ ప్రకటించి వారి మొహాల్లో రంగులు అద్దింది. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ రాష్ట్రాల్లోని బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు డేటా స్పెషల్ టారిఫ్ వోచర్ల (ఎస్టివి)పై పలు ఆఫర్లను ప్రకటించింది.
* 10 రోజుల వాలిడిటీ తో కూడిన డేటా ఎస్టివి 156 వోచర్పై అందిస్తున్న 3జిబి డేటాకు బదులుగా 4జిబి డేటాను అందిస్తుంది.
* ఎస్టివి 198 వోచర్పై 3జిబి డేటాకు బదులుగా 7 జిబి (24 రోజుల వాలిడిటీ)
* 292 ఎస్టివి వోచర్కు 14జిబి డేటా
* 549 ఎస్టివికి 30 జిబి డేటాను అందిస్తున్నట్లు బిఎస్ఎన్ఎల్ తెలిపింది.
ఈ ప్రత్యేక ఆఫర్లు ఈ నెల 10 వ తేదీ నుంచి 17 వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది.