టెలికం రంగం లో ప్రవైట్ సంస్థల భారీ ఆఫర్స్ తో వినియోగదారులను ఆకట్టుకుంటూ వస్తుంటే..మేము కూడా తక్కువేం కాదు అన్నట్లు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) సరికొత్త ఆఫర్స్ తో కస్టమర్లను కాపాడుకునే పనిలో పడింది..ఇప్పటికే రోమింగ్ , ఆన్ లిమిటెడ్ ఆఫర్స్ ను ప్రకటించిన బిఎస్ఎన్ఎల్, తాజాగా ల్యాండ్ లైన్ కస్టమర్లకు కూడా తీపి కబురు తెలియజేసింది..
కొత్త లాండ్లైన్ కనెక్షన్ తీసుకునే కస్టమర్లు తమ సొంత క్లిప్ టెలిఫోన్ ఇన్స్ర్టూమెంట్ (కార్డ్లెస్ )ను ఏర్పాటు చేసుకున్నట్లయితే వారికి తదుపరి బిల్లులో 200 రూపాయల రాయితీ ఇవ్వనుందని ప్రకటించింది. ఈ ప్లాన్ మార్చి 31వరకు అందుబాటులో ఉంటుందని తెలియజేసింది..ల్యాండ్ లైన్ కానెక్షన్స్ పెంచే దిశగా బిఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్స్ ను ప్రకటిస్తుంది.