టెలికం రంగం లో జియో సృష్టిస్తున్న అలజడిని తట్టుకోవడానికి ప్రవైట్ టెలికం సంస్థలతో పాటు ప్రభుత్వ రంగమైనా బీఎస్ఎన్ఎల్ కూడా సరికొత్త ఆఫర్స్ ను ప్రకటిస్తూ కస్టమర్లను కాపాడుకునే పనిలో పడింది. ఇప్పటికే ఎయిర్టెల్, ఐడియా సంస్థలు పలు ఆఫర్లను ప్రకటించగా, తాజాగా బీఎస్ఎన్ఎల్ కూడా సరికొత్త ఆఫర్ ను ప్రకటించింది. ప్రతిరోజూ 2 జీబీ 3జీ డేటా, నెట్వర్క్ పరిధిలో అపరిమిత కాల్స్, ఇతర నెట్వర్క్లకు మాట్లాడేందుకు రోజుకు 25 నిమిషాలు ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపింది.
ఉచిత నిమిషాలు పూర్తి అయినా తర్వాత మాట్లాడే ప్రతి కాల్కు నిమిషానికి 25పైసలు చొప్పున కాల్ కాస్ట్ పడుతుందని తెలియజేసింది. రూ.339తో రీఛార్జిపై ఈ సదుపాయాలను పొందొచ్చు. 28 రోజుల కాలపరిమితిపై ఈ ప్యాక్ను అందిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ తెలిపింది.