మార్కెట్లోకి గెలాక్సీ ట్యాబ్ ఎ 8.0

భారత మార్కెట్లోకి శాంసంగ్ సరికొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను తీసుకొచ్చింది. గెలాక్సీ ట్యాబ్ ఎ 8.0 (2019) పేరిట ఇది విడుదల అయ్యింది. దీని ధర వచ్చేసి రూ.9,999 ఉండ‌గా, ఎల్‌టీఈ వేరియెంట్ ధర రూ.11,999 గా నిర్ణయించారు. వీటిని కొనుగోలు చేసిన వారికి యూట్యూబ్ ప్రీమియం ప్లాన్‌ను 2 నెలల పాటు ఉచితంగా అందివ్వనున్నారు.

దీని ఫీచర్లు చూస్తే…

* 8 ఇంచ్ డిస్‌ప్లే, 2 గిగాహెడ్జ్ స్నాప్‌డ్రాగన్ 429 ప్రాసెసర్
* 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 9.0 పై, 8, 2 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు
* వైఫై, 4జీ ఎల్‌టీఈ, 5100 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లు ఉన్నాయి.