ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా తాజాగా భారత మార్కెట్లోకి సరికొత్త కార్ ను విడుదల చేసింది. దేశీయంగా తయారు చేసిన మొదటి మోడల్ డబ్ల్యూఆర్-వీ కారు లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ.7.75లక్షల నుంచి రూ.9.99లక్షల(దిల్లీ ఎక్స్షోరూం) మధ్య ఉంటుందని సంస్థ తెలిపింది.
పెట్రోలు, డీజిల్ వెర్షన్లలో ఈ కారు లభ్యమవుతుంది. పెట్రోల్ వెర్షన్లో లభించే రెండు రకాల కార్ల ధరలు ధర రూ.7.75, రూ.8.99లక్షలు కాగా.. డీజిల్ వెర్షన్లో లభించే కార్ల ధరలను రూ.8.79లక్షలు, రూ.9.99లక్షలు(దిల్లీ ఎక్స్షోరూం ఖరీదు)గా హోండా నిర్ణయించింది.
భారత్ కార్ల మార్కెట్కు ఉన్న డిమాండ్ దృష్ట్యా అత్యుత్తమ సౌకర్యాలు, ఫీచర్లతో కార్లను విడుదల చేస్తున్నట్లు హోండా కార్స్ ఇండియా అధ్యక్షుడు, సీఈవో యుచిరో యునో వెల్లడించారు. ఈ సరికొత్త మోడల్ కారు అన్ని వర్గాల వారికి చేరువ అవుతుందని తెలియజేసారు.
ఈ కార్ ఫీచర్స్ విషయానికి వస్తే..
* శాటిలైట్ లింక్డ్ నావిగేషన్
* స్మార్ట్ఫోన్ కనెక్టవిటీ
* డ్యూయల్ ఎయిర్బ్యాగ్స్
* యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి హంగులతో ఈ కొత్త మోడల్ మార్కెట్లోకి వస్తోంది.