హువావే నుండి ఎం5 లైట్‌ ట్యాబ్లెట్..

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ హువావే ..తాజాగా ఆండ్రాయిడ్‌ ట్యాబ్లెట్‌.. మీడియాప్యాడ్‌ ఎం5 లైట్‌ను భారత మార్కెట్ లో విడుదల చేసి ఆకట్టుకుంది. దీని ధర వచ్చేసి రూ.22,990 గా నిర్ణయించారు. మార్చి 6వ తేదీ నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది.

ఇక దీని ఫీచర్లు చూస్తే..

* 10.1 ఇంచుల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే
* 1920 x 1200 పిక్సల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌
* హై సిలికాన్‌ కైరిన్‌ 659 ప్రాసెసర్‌, 4జీబీ ర్యామ్‌
* 64 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్‌ 8.0 ఓరియో
* 8, 8 మెగాపిక్సల్‌ బ్యాక్‌, ఫ్రంట్‌ కెమెరాలు
* ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్‌ 4.2 ఎల్‌ఈ
* యూఎస్‌బీ టైప్‌ సి, 7500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫాస్ట్‌ చార్జింగ్‌.. తదితర ఫీచర్లను అందిస్తున్నారు.