ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కియా కంపెనీ కార్ ను విడుదల చేయబోతున్నారు. కియా సంస్థ కు చెందిన సరికొత్త ‘సెల్తోస్’ కార్ ఈనెల 8న మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్ను కియా కంపెనీ ప్రతినిధులు ఆహ్వానించారు.
జగన్ నివాసంలో కంపెనీ ఎండీ కూక్ హ్యున్ షిమ్, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ థామస్ కిమ్ కలిసి కొత్తకారు ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఏడాదికి 3 లక్షల కార్లను అనంతపురం జిల్లా పెనుగొండ ప్లాంటు ద్వారా ఉత్పత్తి చేయగలమని కంపెనీ ప్రతినిధులు చెప్పారు.